- ముంబయిలో సైబర్ నేరాలు
- పేదల పేరుతో మ్యూల్ ఖాతాలు
- రెండు సంస్థల ముసుగులో భారీ స్కామ్
- రూ.60 కోట్లకు పై చిలుకు మోసం
- థాయ్ లాండ్, మలేషియాలకు కూడా విస్తరించిన క్రైమ్
ముంబయి: ముంబైలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. అమాయకులైన పేదల ఆధార్ కార్డులతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి రూ. 60 కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడ్డారు. ముంబై మురికివాడలకు చెందిన పేదలకు డబ్బు ఆశ చూపించి ఆధార్, పాన్ కార్డులను సేకరించారు. ఆ ఐడెంటీటి కార్డుపై ఫోన్ నంబర్స్ తీసుకునేవారు. ఆపై బ్యాంక్ ఖాతాలను తెరిచి, ట్రాన్సాక్షన్స్ చేసేవారు. ఇలా సైబర్ క్రైమ్ కోసం మొత్తం 943 బ్యాంక్ అకౌంట్లు తెరిచారు. ముంబై నుంచి కోటి 67 లక్షల రూపాయలు, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి 10 కోట్ల 57 లక్షల రూపాయలు… ఇలా దేశ అంతటా కలిపి మొత్తం 60 కోట్ల 82 లక్షల రూపాయలను నిందితులు దోచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముంబైలోని కండివాలిలో ఉన్న ‘డిజి సర్జ్ కన్సల్టెన్సీ’, ‘ప్రిటిట్ లాజిస్టిక్స్’ అనే రెండు సంస్థల ముసుగులో ఈ స్కామ్ జరిగింది. సైబర్ నేరస్థుల కోసం బ్యాంకు ఖాతాలను( మ్యూల్ ) సృష్టించడంలో రెండు కంపెనీలు పని చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక రహస్య సమాచారం మేరకు, క్రైమ్ బ్రాంచ్ ఆగస్టు 12న ఈ సంస్థలపై దాడి చేసింది. వైభవ్ పటేల్, సునీల్ కుమార్ పాస్వాన్, అమన్కుమార్ గౌతమ్, ఖుష్బు సుందర్జల, రితేష్ బండేకర్లతో సహా కీలక నిందితులను అరెస్టు చేసింది. సమతా నగర్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318(4), 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తులో షాకింగ్ ....
మరింత సమాచారం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి
MANASARKAR
0 Comments